అందువల్ల ఆలయ ప్రహరీ గోడలు అత్యంత పటిష్టంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ఏనుగు ఒకదాన్ని పెంచుతున్నారు. సుందర గజరాజా అనే ముద్దు పేరు కలిగిన ఈ ఏనుగు పట్ల ఇక్కడకు వచ్చే భక్తులు ప్రేమాభిమానాలు చూపుతారు. ఆలయంలో నవగ్రహ, వేదపారాయణ వంటివి రోజువారీ ప్రత్యేక పూజలుగా చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి యేడాది వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుతారు.
చవితి నవరాత్రి సమయాల్లో ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకున్నట్టయితే మన కోర్కెలు తీరుతాయనే భావన భక్తుల్లో నెలకొంది. అందువల్లే ఇక్కడకు స్థానికులే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి ఆది దేవుని దర్శనం చేసుకుంటారు.
ఎలా వెళ్లాలి? బస్సు మార్గంలో.. పూణె నుంచి 235 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో సాంగలి గ్రామం ఉంది. ముంబై, పూణె, కొల్హాపూర్ తదితర ప్రాంతాల నుంచి డైరక్టు బస్సు సర్వీసులు ఉన్నాయి. రైలు మార్గంలో.. సాంగలి రైల్వే స్టేషన్కు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం.. కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలసి వుంది.
|