గ్వాలివదాకు మాన్మోది వ్యాధి నుంచి, భూతప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మనుదేవి మాత ప్రస్తావనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పురా పర్వతశ్రేణుల్లో మనుదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రస్తావన ఉంది.ఈ పురాతన ఆలయంలో ఏడు నుంచి ఎనిమిది బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మనుదేవి, గణేష్, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బల్పడ్డాయి. ఆలయం చుట్టూత, ముందుభాగంలోనూ ప్రకృతిశోభాయమానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అదమైన వాటర్ఫాల్ 'కావ్తాల్' ఉంది. ఈ ఆలయానికి భక్తులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మనుదేవి కృపా కటాక్షాల కోసం దేశం నలుమూలల భక్తులు ఇక్కడకు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది. తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం, సత్పురా మనుదేవి ఆలయ ట్రస్టు సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశాయి. ఈ రోడ్డు వేయక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారు. ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం ద్వారా.. భుసావల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో యావల్ ఉంది. అక్కడ నుంచి బస్సులో మునువాడి ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా.. దేశంలోని ప్రధాన ప్రాంతాల నుంచి భుసావల్కు రైలు సౌకర్యం ఉంది. విమానమార్గం.. ఔరంగాబాద్ విమానాశ్రయం 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|