ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు > ధర్మరాజు నిర్మించిన బాగ్లాముఖి ఆలయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధర్మరాజు నిర్మించిన బాగ్లాముఖి ఆలయం
తంత్రాలను ఆధారంగా చేసుకుని లిఖించబడిన పురాతన గ్రంథాల్లో పది మహావిద్యాస్‌ ప్రస్థావన ఉంది. వీటిలో ఒకటి బాగ్లాముఖి ఒకటి. దేవతామూర్తుల్లో బాగ్లా‌ముఖీ దేవతకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. బాగ్లాముఖి మాతకు కేవలం మూడు పురాతన ఆలయాలు మాత్రమే ఉన్నాయి. వీటిని సిద్ధపీఠాలుగా పిలుస్తారు. వీటిలో ఒకటి నల్కేఢాలో ఉంది. ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. నల్కేఢాలో ఉన్న బాగ్లాముఖీ దేవత గురించి మీకు పరిచయం చేస్తాం.

బాగ్లాముఖి దేవతకు దేశంలో మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇవి మధ్యప్రదేశ్‌లోని దతియా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న నల్కేఢాలో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

వీటిలో ఒకటి మూడు ముఖాలు (త్రిముఖం) కలిగిన బాగ్లాముఖి మాత ఆలయం లఖుందర్ నదీతీరంలో వెలసివుంది. ఇది షాజ్‌పూర్ జిల్లాలోని నల్కేఢాలో ఉంది.
WDWD
ఈ ఆలయం ద్వాపర యుగానికి చెందినది కావడమే కాకుండా.. అత్యంత మహిమాన్మితమైనదిగా పేర్కొంటారు. దైవ శక్తులను పొందేందుకు దేశంలోని నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు ఈ ఆలయానికి వచ్చి, తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు.


ఈ ఆలయంలో బాగ్లాముఖి దేవత విగ్రహమే కాకుండా లక్ష్మీ, కృష్ణ, హనుమాన్, భైరవ్, సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. మహాభారత యుద్ధంలో విజయుడైన యుధిష్టురుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పేర్కొంటారు. అంతేకాకుండా.. ఆలయంలోని బాగ్లాముఖి విగ్రహం స్వయంభుగా వెలసినట్టు ఇక్కడి భక్తుల భావన.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
భక్తుల కోర్కెలు తీర్చే జగన్నాథుడు  
సర్వ మతాలకు ప్రీతిపాత్రుడు వీర్ గోగాదేవ్  
నాసిక్‌లోని కాళరామ్ మందిరం  
నవ దంపతులు సందర్శించే మునుదేవి ఆలయం  
ప్రపంచ వారసత్వ సంపదగా బామ్ జీసస్ చర్చి  
సోదరభావం ఉట్టిపడే మీరాన్ దాతార్ దర్గా