
తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్మల్ని మహారాష్ట్రలోని త్రివిక్రమ దేవాలయానికి తీసుకువెళుతున్నాం. త్రివిక్రమ ఆలయాన్ని 1744లో సుప్రసిద్ధ సన్యాసులు శ్రీ కడోగి మహరాజ్ నిర్మించారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని షెండూర్ని గ్రామంలో ఖాందేష్ ప్రాంతంలో నెలకొని ఉంది. ఆలయ ప్రధాన అర్చకులు శాంతారామ్ మహరాజ్ భగత్ చెప్పినదాని ప్రకారం... శ్రీ కడోగి సన్యాసులవారు పాంధర్పూర్లోని విఠలేశ్వరుని దర్శించుకునేందుకు ఏటా కాలినడకన వెళ్లేవారట. ఒకరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో సన్యాసులవారి ముందు విఠలేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారట. అనంతరం కడోగి సన్యాసులవారితో తన విగ్రహం షెండూర్ని గ్రామంలోని ఓ నది ఒడ్డున భూమిలో ఉన్నదని చెప్పారట. తన వాహనమైన వరాహంతోపాటు తన విగ్రహాన్ని వెలికి తీసి శాస్త్రోక్తంగా దేవాలయంలో ప్రతిష్టించమని చెప్పారట. అలా విఠలేశ్వరుడు చెప్పిన ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఇది జరిగిన తర్వాత కడోగి సన్యాసులవారు నేరుగా తన స్వగ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని తోటి గ్రామస్తులకు తెలిపారట. అయితే ఆయన మాట ఎవరూ నమ్మలేదు. నమ్మకపోవడం అటుంచి... గ్రామస్తులందరూ కలిసి అతనో పిచ్చివాడని గేలి చేయడం మొదలుపెట్టారు. కానీ కడోగి మాత్రం ఎలాగైనా స్వామివారి విగ్రహాన్ని వెలికితీయాలని నిర్ణయించుకున్నాడు.
|