కొలంబో ఎస్ఎస్సీ గ్రౌండులో భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ వర్ణపురా అర్ధ సెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజ్లో వర్ణపురా (50), మహేళ జయవర్ధనే (16) లు ఉన్నారు.
లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా-బెథానీ మాటెక్ జోడీ క్వార్టర్ ఫైన్లలోకి అడుగుపెట్టింది. భారత-అమెరికా జోడీ 6-3, 6-4 సెట్ల తేడాతో యూఎస్-రష్యా ద్వయంపై జయభేరి మోగించింది.