ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009 (Icc Champions Trophy 2009)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన గ్రూపు బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆతిథ్య జట్టు విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పరాజయంపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకొని రెండో మ్యాచ్ బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఇక్కడ మాత్రం గట్టెక్కింది. కివీస్‌పై విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
  ఇంకా చదవండి
 
గత ఏడాది ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తరువాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు తాము మళ్లీ భారత్ రావాలని అనుకోలేదని, అయితే తమను బలవంతంగా అక్కడికి పంపారని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ తన స్వీయచరిత్ర (యాషెస్ టు యాషెస్)లో పేర్కొన్నాడు. ముంబయి దాడుల తరువాత తాను భారత్‌లో టెస్ట్ సిరీస్ ఆడాలని కోరుకోలేదని చెప్పాడు.
 
టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి గంభీర్ పూర్తి ఫిట్‌నెస్‌తోనే వెళ్లాడని స్పష్టం చేసింది. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ సందర్భంగా గజ్జల్లో గాయంతో ఈ సిరీస్‌లో ఆడకుండానే గంభీర్ స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.