గత ఆదివారం నిర్యాణం చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంత్యక్రియలు బుధవారం ఉదయం తొమ్మిది గంటలలోపు జరుగనున్నాయి. దేశంలో అత్యంత పేరుగాంచిన వేద పండితులు ఈ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశంలో ఉన్న పలు పుణ్య, జీవనదీ జలాలను ప్రత్యేకంగా పుట్టపర్తికి తెప్పిస్తున్నారు.