వచ్చే సంవత్సరం తమ గడ్డపై భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య టెస్టు సిరీస్ నిర్వహించేందుకు ఇంగ్లండ్ అమితాసక్తిని చూపుతోంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సమ్మతిస్తే ఈ చిరస్మరణీయమైన టెస్టు సిరీస్ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రెసిడెంట్ గైల్స్ క్లార్క్ తెలిపారు.