న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి చివరి ఓవర్లే కారణమని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. కివీస్ బ్యాట్స్మెన్కు తమ బౌలర్లు చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వటం తమ ఓటమికి కారణమి ధోని తెలిపాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పొవటంతో భారత్ విజయావకాశాలు సన్నగిల్లాయని ఆయన అన్నాడు.
ఆట ముగిసేంతవరకు తాను, కార్తీక్ బరిలోనిలిచివుంటే విజయావకాశాలు ఉండేవని ధోని ఓటమి కారణాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం తెలిపాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వరల్డ్ కప్ ట్వంటీ-20లో ఆదివారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చివరి ఐదు ఓవర్లలో భారత్పై దాదాపు 80 పరుగులు చేసింది.
|