ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రెఫరీ మైక్ ప్రొక్టర్ అభియోగాలు నమోదు చేశారు. ఐసిసి నియమావళిలోని నిబంధన మూడు కింద హాగ్పై వీటిని నమోదు చేశారు. సిడ్నీలో జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజున కుంబ్లే, ధోనీలను దూషించాడని హాగ్పై టీమ్ ఇండియా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ రెఫరీ మైక్ ప్రొక్టర్ మంగళవారం అభియోగాలు నమోదు చేసి, విచారణను మాత్రం వచ్చే 14వ తేదీకి వాయిదా వేశారు.
ఇందులో అభియోగాలు నిర్ధారణ అయితే హాగ్పై రెండు నుంచి నాలుగు టెస్ట్ మ్యాచ్లు లేదా నాలుగు నుంచి ఎనిమిది వన్డేలు ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్పై ఆసీస్ క్రికెటర్ సైమండ్స్ జాతి వివక్ష ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీంతో.. భజ్జీపై మూడు టెస్ట్ మ్యాచ్ల నిషేధాన్ని ఐసిసి విధించింది.
|