న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్డెవిల్స్పై విజయం సాధించింది. ఢిల్లీ డేర్డెవిల్స్ విసిరిన 188 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టీఫెన్ ఫ్లెమింగ్ (44), విద్యుత్ (40), ధోనీ (33), ఎ.మోర్కిల్ (30) లు రాణించారు. ఓపెనర్లు విద్యుత్-ఫ్లెమింగ్లు తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. డేర్డెవిల్స్ బౌలింగ్ను తుత్తునియులు చేసి సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు పరుగులు పిండుకున్నారు. సూపర్ కింగ్స్-డేర్డెవిల్స్ మధ్య జరిగిన రెండు మ్యాచ్లలో చెరోటి గెలుచుకుని సమానంగా ఉన్నారు.
|