వచ్చే నెలలో జరుగనున్న ముక్కోణపు సిరీస్లో ఆడించే జట్టు ఎంపిక కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా 20 మంది సభ్యులతో కూడిన ఒక జాబితాను సెలక్షన్ కమిటీ తయారు చేసి, ఈనెల 20వ తేదీలోగా క్రికెట్ బోర్డుకు సమర్పించనుంది. ఇందులో నుంచి 16 మంది ఆటగాళ్ళతో తుది జట్టును ఖరారు చేస్తారు. జూన్ నెల ఎనిమిదో తేదీ నుంచి భారత్-బంగ్లాదేశ్-పాకిస్థాన్ దేశాల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగనుంది.
బంగ్లా దేశ రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మ్యాచ్లన్ని జరుగుతాయి. దీనిపై పిసిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి షఫ్కాత్ నజ్మీ మాట్లాడుతూ.. జట్టుకు అందుబాటులో ఉండే అనేక మంది ఆటగాళ్లు మల్టీ మిలియన్ డాలర్లు కుమ్మరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నిమగ్నమైవున్నారని, అందువల్ల జట్టు కోసం ఎంపిక చేసే ఆటగాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
|