ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆటగాళ్లకు సైనిక శిక్షణ : పాక్ క్రికెట్ బోర్డ్  Search similar articles
క్రికెట్‌లో ఆటగాళ్లు క్రమశిక్షణతో మెలిగేలా చేయడానికి పాకిస్థాన్ సరికొత్త దారులను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇకనుంచి టోర్నీలకు ముందు ఆటగాళ్లకు సైనిక శిక్షణ ఇప్పించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయించింది.

ఈ విషయమై పీసీబీ మేనేజర్ తలత్ అలీ మాట్లాడుతూ త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న జట్టుకు ప్రస్తుతం సైనిక శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. వారం రోజులపాటు కొనసాగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఆటగాళ్లకు అన్ని తరహాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇందుకోసం జట్టు ట్రైయినర్ పర్యవేక్షణలో ఈ సైనిక శిక్షణ అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆటగాళ్లలో మరింత క్రమశిక్షణ తీసుకురావడం కోసమే తామీ రకమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో సైతం పాక్ క్రికెట్ బోర్డ్ తమ ఆటగాళ్లకు ఇలాంటి సైనిక శిక్షణ అందించిందని ఆయన తెలిపారు.
మరిన్ని
క్రికెట్‌కు స్వస్తి పలకనున్న హెడెన్
రాయపూర్‌లో కొత్త క్రికెట్ స్టేడియం
నేటి నుంచి శ్రీలక-భారత్ తొలి టెస్ట్
భద్రత కల్పిస్తే పాకిస్థాన్‌కు రెడీ : హేడెన్
రెండో టెస్ట్: తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లాండ్
త్రీడే మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం