దాదాపు ఆరేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ పర్యటన సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు, ఐదు వన్డేలతో సహా ఓ ట్వంటీ20 మ్యాచ్ కూడా జరగనుంది.
వచ్చే ఏడాది మార్చి ఆరు నుంచి ఏప్రిల్ ఏడు వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొదటగా భారత్, న్యూజిలాండ్ల మధ్య ట్వంటీ20 మ్యాచ్ జరగనుంది.
గత 2002-03లో జరిగిన టోర్నీ సందర్భంగా న్యూజిలాండ్లో పర్యటించిన భారత జట్టు అటుపై ఇప్పుడే కివీస్ పయనానికి సిద్ధం కావడం గమనార్హం.
|