ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > అవార్డుల గురించి ఆలోచించడం లేదు : గంభీర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అవార్డుల గురించి ఆలోచించడం లేదు : గంభీర్
ఐసీసీ ప్రకటించే అవార్డుల గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. జాతీయ జట్టులో ఆడే విషయాన్ని గురించి తప్ప తాను మరే విషయం గురించీ పెద్దగా ఆలోచించబోనని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులకు తన పేరు ఎంపికకాకపోవడంపై గంభీర్ మాట్లాడుతూ అవార్డులు సాధించాలన్న ఆలోచన తనలో ఎప్పుడూ లేదని అన్నాడు. అలాగే రికార్డులు సృష్టించాలన్న ఆలోచన కూడా తనలో లేదని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల తాను సంతృప్తితో ఉన్నానని గంభీర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

తనలోని బలహీనతలను మెరుగుపర్చుకుంటూ తాను గరిష్టంగా పరుగులు చేయగల్గుతున్నానని అందుకే ఆట గురించి తప్ప మిగిలిన విషయాల గురించి తాను పెద్దగా పట్టించుకోవడం లేదని గంభీర్ తెలిపాడు.

ఈ ఏడాదిలో భారత్ తరపున కెప్టెన్ ధోనీ తర్వాత వన్డే క్రికెట్‌లో గంభీర్ మాత్రమే అత్యధిక పరుగులు సాధించడం గమనార్హం. మొత్తం 23 వన్డేల్లో 47.20 సగటుతో ఈ ఏడాది గంభీర్ మొత్తం 944 పరుగులు సాధించాడు. అదేసమయంలో ధోనీ 24 మ్యాచ్‌లలో 955 పరుగలు సాధించి గంభీర్ కంటే ముందు స్థానంలో నిలిచాడు.
మరిన్ని
ధోనీకి టెస్ట్ కెప్టెన్సీ వ్యవహారం : కిర్‌స్టన్‌పై కపిల్ విమర్శ
సైమండ్స్‌కు సీఏ టాటా చెప్పనుందా ?
నాలో ఇంకా ఆడే సత్తా ఉంది : గంగూలీ
అక్తర్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మళ్లీ క్రీజులోకి అక్తర్ : మెట్టు దిగిన పీసీబీ
వన్డేల్లోనూ రెఫరల్ విధానానికి ఐసీసీ ప్రయత్నాలు