ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్సీ : లక్ష్మణ్‌కు ఉద్వాసన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్సీ : లక్ష్మణ్‌కు ఉద్వాసన
ఐపీఎల్ టోర్నీలో తలపడుతోన్న హైదరాబాద్ జట్టు డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా కొనసాగుతోన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు ఉద్వాసన పలికింది. లక్ష్మణ్ స్థానంలో జట్టు వైస్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

గత సీజన్‌లో ఐపీఎల్ టోర్నీలో తలపడిన ఎనిమిది జట్లలో డెక్కన్ ఛార్జర్స్ జట్టు చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం కొత్త సీఈఓను నియమించిన యాజమాన్యం ప్రస్తుతం కెప్టెన్సీ మార్పుకు సిద్ధమైంది.

ఐపీఎల్ టోర్నీలో భాగమైన ట్వంటీ20 తరహా క్రికెట్‌కు లక్ష్మణ్ పనికిరాడని ఆ తరహా ఆటకు సరిపోయే నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని గత కొంతకాలంగా గుసగసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడైన అఫ్రిది సైతం లక్ష్మణ్ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు.

ఇలా అందరి దృష్టిలో వివాదమైన లక్ష్మణ్ కెప్టెన్సీపై తాజాగా జట్టు యాజమాన్యం సైతం నమ్మకం కోల్పోవడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయక పోవడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ మూడు ప్రాంతాల్లో ఛాంపియన్ లీగ్ టోర్నీ  
సెలక్టర్ పదవి సంతృప్తినిచ్చింది : వెంగ్ సర్కార్
ఆస్ట్రేలియాను తేలిగ్గా తీసుకోం : సచిన్
ఢిల్లీ వేదికపై అభ్యంతరం లేదు : క్రికెట్ ఆస్ట్రేలియా
అక్టోబర్ ఒకటిన భారత టెస్ట్ జట్టు ఎంపిక
పరుగుల దాహం ఇంకా తీరలేదు : హెడెన్