వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. తన కెప్టెన్సీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్టు గేల్ ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు. ట్వంటీ-20 క్రికెట్కు పెరుగుతున్న ఆదరణ వల్ల టెస్ట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఇది తనను ఎంతగానో కలచి వేస్తోందన్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐపీఎల్ రెండో అంచె పోటీల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడిన గేల్.. ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టుకు రెండు రోజుల ముందుగా లార్డ్స్కు చేరుకున్నాడు. దీనిపై విమర్శలు గుప్పుమన్నాయి.
రెండు రోజులకు ముందు జట్టులో చేరే క్రికెటర్ను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్.. గేల్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గేల్.. తన కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్ తన జట్టుపై దృష్టి సారించాలని చురక అంటించాడు. |