వచ్చే నెలలో ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచకప్ ట్వంటీ-20 ఛాంపియన్షిప్లో భాగంగా భారత్తో లేదా శ్రీలంకతో ట్వంటీ- 20 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు చర్యలు చేపట్టామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.
తమ దేశంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రాణభయంతో వలసపోయిన పౌరుల సహాయార్థం ఈ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు పీసీబీ అధికారులు చెప్పారు.
వీరి కోసం విరాళాలు సేకరించేందుకు భారత్ లేదా శ్రీలంకతో ట్వంటీ- 20 ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. |