ఆటగాడిగా లక్ష్మణ్ సేవలు జట్టుకు అవసరం లేదని జట్టు యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు డెక్కన్ ఛార్జర్స్ కెప్టన్ ఆడమ్ గిల్క్రిస్ట్ తెలిపాడు. లక్ష్మణ్కు ఈ విషయాన్ని ముందే చెప్పడం జరిగిందని గిల్లీ వెల్లడించాడు. ఐపీఎల్ రెండో సీజన్ ఆరంభంలో ఐదు మ్యాచ్లు ఆడిన లక్ష్మణ్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
దీనికి కారణం.. టోర్నీ తొలి దశ ముగియగానే ఫ్రాంఛైజీ లక్ష్మణ్ సేవలు అవసరం లేదని చెప్పింది. ఈ విషయాన్ని గిల్లీ వెల్లడించాడు. ఈసారి మానసికంగా లక్ష్మణ్ బాగా ఒత్తిడికి లోనయ్యాడు. అతడి కెప్టెన్సీ పోయింది. ఇక్కడ ఉండి ఐదు మ్యాచ్లు ఆడాడు.
టోర్నీ చివర్లో అతని సేవలు అవసరం లేదని ముందే చెప్పాము. అయితే లక్ష్మణ్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాం. అందుకే ఇక్కడ ఉంచామని, ఫిజికల్ ట్రైనర్, ఫీల్డింగ్ కోచ్, హెడ్ కోచ్ లీమన్లతో లక్ష్మణ్ జట్టు విజయానికి పనిచేశాడని గిల్లీ చెప్పాడు. |