భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ప్రపంచకప్లో జట్టు పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కూడా ఓ ప్రధాన కారణమని టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్స్టన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. జట్టు ప్రదర్శనను ఐపీఎల్తో ముడిపెట్టడంపై మండిపడింది.
టోర్నమెంట్లో ఆడలేని స్థితిలో లేదా అలిసిపోయి ఉన్న ఆటగాళ్లు తమకు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేసి ఉండాల్సిందని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ మీడియా, ఆర్థిక మిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు బోర్డు వద్ద కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు.
కీలక ఆటగాళ్లు గాయాలతో ఉండటం జట్టు పూర్తిస్థాయిలో రాణించలేకపోయిందని కిర్స్టన్ చెసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఆడలేనివారు బోర్డుకు ఆ విషయాన్ని తెలియజేసే స్వేచ్ఛ ఉంది. తాము ఏ టోర్నీలోనూ కచ్చితంగా ఆడాలని ఏ ఆటగాడిని బలవంతపెట్టడం లేదు. ఆడలేనివారి స్థానాలు భర్తీ చేసేందుకు బీసీసీఐ వద్ద ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయని శుక్లా పేర్కొన్నారు. |