అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పాకిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదికి డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. శ్రీలంకతో ఆదివారం లార్డ్స్లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిోల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అజేయ అర్ధ సెంచరీతో ఈ మ్యాచ్లో పాకిస్థాన్ సునాయస విజయం సాధించడంలో అఫ్రిది కీలకపాత్ర పోషించాడు. ఇందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిదికి ఐసీసీ అధికారుల నుంచి అనూహ్యంగా పిలుపు అందింది. అతనికి డోప్ పరీక్షలు నిర్వహించారు. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే జట్లలో ఎవరో ఒకరికి డోప్ పరీక్షలు నిర్వహించడం సాధారణమే. |