భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం త్వరలో ఆస్ట్రేలియా- టీం ఇండియాల మధ్య స్వదేశంలో జరగనున్న మ్యాచ్లకు వేదికలు ఖరారు చేసింది. ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబరు 11 వరకు భారత్లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో ఆసీస్ జట్టు భారత్తో ఏడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడు వన్డే మ్యాచ్లు గౌహతి, ఢిల్లీ, ముంబయి, మొహాలీ, హైదరాబాద్, నాగ్పూర్, జైపూర్ నగరాల్లో జరుగుతాయని బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. |