వచ్చే యేడాది కరేబియన్ దీవుల్లో జరగాల్సిన మూడో ట్వంటీ-20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీల కారణంగా టీ-20 ప్రపంచ కప్ను వాయిదా పడ్డాయి.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీ-20 ప్రపంచ కప్ ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరగాల్సి వుంది. అయితే, ప్రస్తుతం వారం రోజుల పాటు వాయిదా వేయడంతో ఏప్రిల్ 20వ తేదీన టోర్నీ ఆరంభమై మే 16వ తేదీతో ముగుస్తుంది.
అదేసమయంలో ఐపీఎల్-3 పోటీలు మార్చి 19వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీన ముగుస్తాయి. దీంతో ఐపీఎల్ ముగింపు మ్యాచ్కు, టీ-20 మ్యాచ్ ఆరంభానికి ఒక్కరోజు కూడా సమయం లేకపోవడంతో షెడ్యూల్ను మార్చుతారని వార్తలు వచ్చాయి. తదనుగుణంగా టీ-20 షెడ్యూల్ను మార్చారు. |