మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి వి.చాముండేశ్వరినాథ్పై ఏసీఏ జీవితకాల బహిష్కరణ వేటు వేసింది. విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో లైట్లు, కుర్చీల కొనుగోలులో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఏసీఏ రికార్డుల ట్యాంపరింగ్, మహిళా క్రికెటర్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కార్యదర్శి చాముండిపై వచ్చిన ఆరోపణలతో ఏసీఏ సర్వసభ్య సమావేశం ఏకీభవించింది.
ఫలితంగా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒకరిపై జీవితకాల బహిష్కరణ వేటు వేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా దేశ క్రికెట్ చరిత్రలోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరువు, ప్రతిష్టలను మంటగలిపారని చాముండిపై ఏసీఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీఏ సర్వసభ్య సమావేశం విజయవాడలో గురువారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడుతో సహా 39 మంది సభ్యులు హాజరయ్యారు.