ముంబై మారణకాండతో దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో... భారత్లో జరగాల్సిన పాకిస్తాన్ ప్రపంచకప్ (2011) మ్యాచుల్ని, అక్కడ వీలు కాకుంటే శ్రీలంకలో ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది.
దీంతోపాటు ఐపీఎల్-3లో పాక్ ఆటగాళ్లను భారత్లో ఆడేందుకు పాకిస్తాన్ అనుమతిస్తే ఇక ప్రపంచకప్ మ్యాచ్లకు కూడా అడ్డంకులు ఉండబోవని పీసీబీ భావిస్తోంది.
ఇప్పటికే భద్రతా కారణాలతో పాక్ ఆతిథ్యానికి దూరం కావడంతో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లే ఇప్పుడు ప్రపంచకప్కు వేదికలయ్యాయి.
ఈ నేపథ్యంలో.. ప్రపంచకప్ (2011) వేదికను భారత్లో వీలుకాకుంటే శ్రీలంకలో జరుపుతామని ఇటీవల ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్తో జరిగిన భేటీలో పీసీబీ చీఫ్ ఇజాజ్ భట్ ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.