ట్వంటీ-20 ఛాంపియన్స్ లీగ్లో భాగంగా సోమవారం నాడు బెంగుళూరులో జరిగిన మొదటి మ్యాచ్లో సోమర్సెట్ జట్టుపై ట్రినిటాడ్ అండ్ టొబాగో జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రినిటాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
కష్టసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ జట్టు 106 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రినిటాడ్ బౌలర్లలో డ్వాన్ బ్రేవో విజృంభించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
ట్రినిడాడ్ బౌలర్లలో బ్రేవో నాలుగు వికెట్లు పడగొట్టగా, గంగ, ముహమ్మద్ చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.