నాగపూర్లో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్తో తలపడుతున్న ఆస్ట్రేలియా జట్టు 45 పరుగుల వద్ద మూడవ వికెట్ కోల్పోయింది.
రెండవ వన్డేలో భారత్తో తలపడుతున్న ఆస్ట్రేలియా జట్టు 10.5 ఓవర్లకు 45 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది.
వాట్సన్ 19, పాటిన్ 8, పాంటింగ్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం వైట్ నాలుగు పరుగులు చేసి రంగంలో ఉన్నాడు. హుస్సే ఇప్పుడే బ్యాటింగ్ మొదలుపెట్టాడు.
ఇదిలావుండగా రెండో వన్డే ఆటలో ఆస్ట్రేలియాకు భారత్ 355 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. కెప్టెన్ ధోనీ, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ బ్యాటింగ్లో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.