ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఉప్పల్ స్టేడియంలో ఐదో వన్డే: 2 నుంచి టిక్కెట్ల విక్రయం (Cricket| News| India| Australia| 5th One Day| Tickets| Uppal Stadium)
ఉప్పల్ స్టేడియంలో ఐదో వన్డే: 2 నుంచి టిక్కెట్ల విక్రయం
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న ఏడు వన్డేల సిరీస్లో భాగంగా, నవంబర్ 5న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐదో వన్డే టిక్కెట్లను నవంబర్ 2, 3 తేదీల్లో విక్రయించనున్నారు.
హైదరాబాద్లోని బంజారా హిల్స్, సనత్ నగర్, మాదాపూర్, కూకట్పల్లి, మలక్పేట్, సరోజినీ దేవీ రోడ్ యూకో బ్యాంక్ బ్రాంచీల్లో ఈ టిక్కెట్లు లభిస్తాయి. టిక్కెట్ ధరలను రూ. 300 నుంచి, రూ.5వేలకు వరకు నిర్ణయించారు.
ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలుకాగా, 28, 245 టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తారు. వీటిలో 23వేల టిక్కెట్లను యూకో బ్యాంకు, మిగతా టిక్కెట్లు ఈ-సేవ కేంద్రాల ద్వారా విక్రయిస్తారని స్టేడియం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.