ఈ ఏడాది ఆరంభంలో ఇరానీ ట్రోఫీ, ట్వంటీ 20 టోర్నీలను మిస్ చేసుకున్న తర్వాత మీడియం పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. త్వరలో జరిగే రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగే మ్యాచ్కు గైర్హాజరీ కానున్నాడు. మోకాలి గాయం కాణంగా నవంబర్ 3న జరిగే ఈ మ్యాచ్లో ఇర్ఫాన్ పాల్గొనడం లేదు.
ఇర్ఫాన్ స్థానంలో.. శత్రుంజయ్ గేక్వాడ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రెండు రోజుల సమావేశంలో బీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇర్ఫాన్ గైర్హాజరీలో.. కానర్ విలియమ్స్ జట్టుకు సారథ్యం వహిస్తాడని.. పినాల్ షాహ్ వైస్ కెప్టన్సీ బాధ్యతలను అప్పగించినట్లు బీసీఏ తెలిపింది.