ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సెహ్వాగ్, గంభీర్కు గాయాలు: నాలుగో వన్డేకు డౌటే? (Veerendra Sehwag | Goutam Gambhir | Dinesh Kartik | Injuries | Mohali One Day)
న్యూఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల మైదానంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే మూడో వన్డేలో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లు గాయపడ్డారు. దీంతో నాలుగు వన్డేకు వీరు పాల్గొనడంపై అనిశ్చితి ఏర్పడింది. ఇందుకోసం ముందస్తుగా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్కు పిలుపునిచ్చారు.
బీసీసీఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ, మొహలీలో జరిగే నాలుగు వన్డేకు దినేష్ కార్తీక్ భారత జట్టులో ఉంటాడన్నారు. మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో భారత విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్లో సెహ్వాగ్, గంభీర్లకు గాయాలయ్యాయి.
దీంతో నాలుగో వన్డేకు వీరు ఆడనున్నారా లేదా అన్న విషయాన్ని రేపు ఉదయం సమావేశంలో నిర్ణయిస్తారన్నారు. కాగా, నవంబర్ 2వ తేదీన మొహలీలో నాలుగో టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే.