ఇండియన్ ప్రీమియర్ లీగ్-3లో ఆడేందుకు తమ జట్టు ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొట్టిపారేసింది. ఐపీఎల్-3లో పాల్గొనేందుకు ఆటగాళ్లలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వసీం బారీ స్పష్టం చేశారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్లో తమ ఆటగాళ్లను ఆడించే విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. అనేకంగా ఈ సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అవుతుందని చెప్పారు.
ఇదిలావుండగా, పాక్ జట్టు ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ మంగళవారం మాట్లాడుతూ ఐపీఎల్-3లో పాల్గొనేందుకు తమ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చినట్టు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా, తాను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడేందుకు త్వరలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్టు కూడా ప్రకటించారు.