ఐపీఎల్-3లో భాగంగా మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. బ్యాటింగ్కు దిగిన బొపారా, బైస్లా ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో రాయల్ ఛాలెంజర్స్ను బెంబేలెత్తించారు.
బొపారా 50 బంతుల్లో 77 పరుగులు చేస్తే, బైస్లా 51 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. నిజానికి వీళ్లద్దరి గురించి ఇప్పటివరకూ క్రికెట్ అభిమానులకు అంతగా తెలియదు. నేటి అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఇద్దరూ కలిసి ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని అందించటంతో జట్టు స్కోరు 203కి చేరుకున్నదని చెప్పవచ్చు.
ఇకపోతే ఆ తర్వాత యువరాజ్ సింగ్(9) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జయవర్థనె(26), పఠాన్(3)లిద్దరూ నాటవుట్గా నిలిచి జట్టు స్కోరును 203కు చేర్చారు.