కొలంబో ఎస్ఎస్సీ గ్రౌండులో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొలంబోలో కురిసిన వర్షం కారణంగా తొలి రెండు సెషన్లు జరగలేదు. వర్షం తగ్గిన సమయంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. చివరకు తేనీటి విరామ సమయానికి మ్యాచ్ ప్రారంభం అయింది.
శ్రీలంక జట్టు మహేళ జయవర్ధనే నాయకత్వంలో వాండర్ట్, వర్ణపురా, సంగక్కర, సమరవీర, దిల్షన్, ప్రసన్న జయవర్ధనే, వాస్, కులశేఖర, మెండిస్, మురళీథరన్లు ఉన్నారు.
భారత జట్టు అనిల్ కుంబ్లే సారథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, దినేష్ కార్తీక్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు ఉన్నారు.
|