ఉత్తరప్రదేశ్ బ్యాడ్మింటన్ అకాడమీ హాల్లో జరుగుతున్న 19వ ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో చైనా తన హవాను కొనసాగిస్తోంది. పురుషుల, మహిళల విభాగంలో చైనా ప్రత్యర్థులను ఖంగుతినిపించింది. పురుషుల విభాగం ఫైనల్లో జపాన్ను 3-2 తేడాతో ఓడించింది. అలాగే మహిళల ఫైనల్ పోరులో 3-1 పాయింట్ల తేడాతో సింగపూర్ను ఓడించి గెలుపును నమోదు చేసుకుంది.