కౌలాలంపూర్లో జరుగుతున్న ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాడు అనూప్ శ్రీధర్ సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన ఈ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్ తౌఫీక్ హిదాయత్ను కంగుతినిపించి విజయం సాధించాడు.
ఈ మ్యాచ్లో శ్రీధర్ 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఇరువురు గట్టిపోటీతో ఆడినా చివరి సెట్లో శ్రీధర్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో శ్రీధర్ 16లో ఉన్న మలేషియా మహ్మద్ హఫీజ్ హషీమ్పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
|