ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
2009 ఆసియన్ టేబుల్ టెన్నిస్‌‌కు భారత్ ఆతిథ్యం
వచ్చే 2009లో జరుగనున్న ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఆతిథ్య అంశాలపై చైనాలోని యాంగ్యూలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ది ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ (ఏటీటీయూ) టేబుల్ టెన్నిస్ సమాఖ్యలతో చర్చలు జరిపింది.

ఇందులో భాగంగా న్యూఢిల్లీలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌ను జరిపేందుకు ఏటీటీయూ నిర్ణయించిందని ఏటీటీయూ అధ్యక్షుడు లి ఫూరాంగ్ చైనాలోని న్యూస్ ఏజెన్సీకి తెలియజేశారు. ఈ ఆసియన్ ఛాంపియన్‌షిప్స్ 1992న జరిగిన సంగతి తెలిసిందే. కతార్ దేశంలో గత 2004న ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్, 2006 ఏషియన్ గేమ్స్‌ను నిర్వహించింది.
మరిన్ని
బ్రిటిష్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లోకి గోసల్, భట్టాచార్య
చైనా ఓపెన్: హింగీస్ విజయం
ప్రపంచచెస్ ఛాంపియన్స్: ఐదో రౌండ్లో ఆనంద్ ఆధిక్యం
సన్‌ఫీస్ట్ ఓపెన్: బట్రోలిపై వానియా కింగ్ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్లో గెలుపొందడమే లక్ష్యం: హంపి
2.5 పాయింట్లతో కొనసాగుతున్న ఆనంద్, క్రామ్నిక్