శ్రీనగర్లో జాతీయ రెస్లింగ్ ఛాంపియన్షిప్ శుక్రవారం నుంచి జరుగనుంది. 26వ జాతీయ జునియర్ బాయ్స్, తొమ్మిదవ జాతీయ రెస్లింగ్ ఛాంపియన్షిప్ పోటిలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఛాంపియన్షిప్లో సుమారు 600 క్రీడాకారులు పాల్గొంటారని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాబు రామ్ పేర్కొన్నారు.
ఈ పోటీలు ఫ్రీ స్టైల్, గ్రెకో-రామన్ స్టైల్ తరహాలో జరుగుతాయని ఆయన తెలిపారు. 400 మంది పురుషులు, 200 మంది మహిళలు పాల్గొంటున్న ఈ ఛాంపియన్షిప్ నిర్వహణా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులు కాశ్మీరీ వ్యాలి అందాలను చూసి ఆస్వాదించాలని బాబు రామ్ తెలిపారు.
|