ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
హకీ క్రీడాకారులకు నగదు బహుమతి
క్రికెటర్లను గౌవరించినట్టుగా తమ రాష్ట్ర క్రీడాకారులను గౌరవించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా.. ఇటీవల హాకీ కప్‌ను కైవసం చేసుకున్న భారత హాకీ జట్టులోని నలుగురు సభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించారు. భారత హాకీ జట్టులో కర్ణాటకు చెందిన విక్రమ్ కాంత్, సునీల్, దిర్కే, రఘునాథ్‌లు ఉన్నారు.

ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు. ట్వంటీ-20 ప్రపంచ క్రికెట్ జట్టులోని కర్ణాటక ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనక వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో హాకీ ఆటగాళ్లకు కూడా ఇవ్వనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని
మోరోజివిచ్‌పై ఆనంద్ అద్భుత విజయం
ఈ నెల 27 నుంచి సబ్ జూనియర్ హాకీ టోర్నీ
ఏ1జిపీ వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న కార్తీకేయన్
డ్రాగా ముగిసిన ఆనంద్, కామ్నిక్ మ్యాచ్
బ్రిటిష్ మాస్టర్స్: 21వ స్థానంలో ముగిసిన జ్యోతి రందవ
డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్: 28వ స్థానంలో సానియా