టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా ప్రి క్వార్టర్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన జపాన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్లో సానియా జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి అయుమి మొరితాపై బరిలోకి దిగి గట్టి పోటీతో 6-0, 6-4 తేడాతో విజయాన్ని సాధించింది.
గాయాల కారణంగా మూడు వారాల పాటు టెన్నిస్కు దూరంగా ఉన్న సానియా తాజా డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్లో ఒక ర్యాంకును కోల్పోయి 29వ స్థానానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ పురుషుల విభాగంలో రోహన్ బోపన్న 252, ప్రకాశ్ అమృత రాజ్ 268వ ర్యాంకుల్లో ఉన్నారు. ఈ టోర్నమెంట్ తర్వాతి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన కాసే డెలకాతో సోనియా తలపడనుంది.
|