ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
అక్టోబర్ 10 నుంచి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్
అక్టోబర్ 10వ తేదీ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2007 ప్రారంభం కానుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డెహ్రాడూన్‌లో జరిగే ఈ పోటీల్లో 400మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జరిగే ఈ మ్యాచ్‌లు పురుషుల, మహిళల విభాగాల్లో జరుగుతాయని జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ పోటీలు గ్రూప్ -13, 16 విభాగాల్లో జరుగుతాయని ఉత్తరాఖండ్ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ డీఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని పరడే గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన అన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి ప్రకాష్ పాంట్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఆయన వివరాలు అందించారు.
మరిన్ని
స్టట్‌గర్ట్ గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్లో హెనిన్ విజయం
భారత్‌లో త్వరలో ఎఫ్-ఒన్ కార్ రేస్: కల్మాడీ
తొలి మ్యాచ్‌లో డుల్కోతో తలపడనున్న సానియా
'గ్రాండ్ మాస్టర్‌'కు తమిళనాడు ప్రభుత్వం 'కరుణ'
జపాన్ ఓపెన్: ఫైనల్‌కు చేరుకున్న వీనస్
జపాన్ ఓపెన్: క్వార్టర్‌లో సానియా ఓటమి