ఆసియా ఓషెనియా క్వాలిఫయింగ్ గ్రూప్ పురుషుల డబుల్స్ విభాగంలో జపాన్పై గెలుపుతో భారత్.. డెవిస్ కప్ ప్రపంచ గ్రూపులోకి ప్రవేశించింది. భారత్కు చెందిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి జోడీ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.
జపాన్కు చెందిన ఇవాబుషి మరియు సుజుకి జంటపై 7-6, 3-6, 6-3, 6-4తో భారత జోడీ జయకేతనం ఎగురవేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువకెరటాలు రోహన్ బోపన్నా, ప్రకాష్ అమ్రితరాజ్లు వేర్వేరు మ్యాచ్లలో జపనీయులపై గెలుపొంది త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
కాగా, పేస్, మహేష్లకు ఆదివారం మాస్టర్ సింగిల్స్ క్వాలిఫైయింగ్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లోను వీరిరువురు తప్పనిసరిగా నెగ్గవలసి ఉంది.
|