బ్రిటన్లో ప్రధాన నగరాల్లో ఒకటైన మాంఛెస్టర్లో ముగిసిన ఎల్టీఏ మాంఛెస్టర్ ట్రోఫీ ఫైనల్లో భారత జోడీ హర్ష్ మన్కడ్-అశుతోష్ సింగ్లు పరాజయం పాలయ్యారు. టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియన్ ద్వయం ఆడం ఫీనీ-రాబర్ట్ స్మీట్స్ చేతిలో 3-6, 7-6, 6-10 సెట్ల తేడాతో భారత జోడీ ఓటమి పాలైంది.
నాలుగో సీడ్ క్రీడాకారులు మన్కడ్-అశుతోష్లు మ్యాచ్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తొలి సెట్లో ఆసీస్ ద్వయం 3-6 తేడాతో విజయం సాధించారు. రెండో సెట్లో భారత జోడీ మన్కడ్-అశుతోష్లు మెరుగ్గా పోరాడి 7-6 తేడాతో విజయం సాధించారు.
మలి సెట్లో భారత జోడీ ఇదే జోరును కొనసాగించలేక 6-10 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ జోడీ 55 ఏటీపీ పాయింట్లు సాధించగా, భారత్ ద్వయం మన్కడ్-అశుతోష్లు 38 ఏటీపీ పాయంట్లు సాధించారు.
|