ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్లాసిక్ టోర్నీ క్వార్టర్స్‌లో సానియా జోడి  Search similar articles
లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా-బెథానీ మాటెక్ జోడీ క్వార్టర్ ఫైన్లలోకి అడుగుపెట్టింది. భారత-అమెరికా జోడీ 6-3, 6-4 సెట్ల తేడాతో యూఎస్-రష్యా ద్వయంపై జయభేరి మోగించింది. రెండో సీడ్ తారలైన సానియా-మాటెక్‌లు మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధికి సవాలు విసిరారు.

తొలి సెట్‌లో వానియా కింగ్-అల్లా కుద్రయేత్సవాలపై 6-3 తేడాతో సానియా జోడి విజయం సాధించింది. మలి సెట్‌లో యూఎస్-రష్యాజోడీ కాస్తంత పోటీనిచ్చినప్పటికీ దానిని అధిగమించి సానియా-మాటెక్‌లు 6-4 తేడాతో గెలుపు సాధించి టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా ద్వయం ఎలీనా వెర్సీనా- వెరా జొనరేవాలతో సానియా మీర్జా జోడీ తలపడుతుంది. సానియా సింగిల్స్ విభాగం తొలి రౌండు మ్యాచ్‌లో ఎవా హర్‌దినోవాపై జయభేరి మోగించి తదుపరి రౌండులోకి అడుగుపెట్టింది. సానియా మీర్జా రెండో రౌండు మ్యాచ్‌లో చైనాకు చెందిన మెంగ్ యువాన్‌తో తలపడుతుంది.
మరిన్ని
అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత్ జోరు
మాంఛెస్టర్ ఫైనల్లో మన్కడ్ జోడీ పరాజయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్‌లో సానియా ముందంజ
2010 కామన్‌వెల్త్ క్రీడలపై భారత్ దృష్టి
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా పతనం
స్టాన్‌ఫోర్డ్‌టోర్నీ టైటిల్ వోజ్నియాక్ కైవసం