ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో భూపతి జోడి  Search similar articles
కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న ఏటీపీ రోజర్స్ మాస్టర్స్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి భూపతి జోడి ప్రవేశించింది. అమెరికా ద్వయం మార్డీ ఫిష్-ఆండీ రాడిక్‌లపై మహేష్ భూపతి-మార్క్ నోలెస్‌లు విజయం సాధించి ముందంజ వేశారు. దీనితో భారత-బహామాస్ జోడీ టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

అమెరికా ద్వయంలో మార్డీ ఫిష్ మోకాలి గాయంతో మ్యాచ్ మొదట్లోనే తప్పుకున్నాడు. దీనితో మ్యాచ్ జరగకుండానే భూపతి-నోలెస్‌లు టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధి బరిలోకి దిగకుండానే భారత-బహామాస్ జోడీ ముందంజ వేసింది.

భారత-చెక్ జోడీ లియాండర్ పేస్, లుకాస్‌లతో మహేష్ భూపతి- మార్క్ నోలెస్‌లు క్వార్టర్స్‌లో తలపడే అవకాశాలు ఉన్నాయి. భారత క్రీడకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్‌లు ఇటీవల కాలంలో ప్రత్యర్ధులు తలపడబోవడం ఇదే మొదటిసారి.
మరిన్ని
క్లాసిక్ టోర్నీ క్వార్టర్స్‌లో సానియా జోడి
అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత్ జోరు
మాంఛెస్టర్ ఫైనల్లో మన్కడ్ జోడీ పరాజయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్‌లో సానియా ముందంజ
2010 కామన్‌వెల్త్ క్రీడలపై భారత్ దృష్టి
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా పతనం