ఆసియా సర్క్యూట్ పోటీలనుంచి తాను తప్పుకుంటున్నట్టు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనూప్ శ్రీధర్ ప్రకటించాడు. గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీధర్ పేర్కొన్నాడు.
ఈ విషయమై శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను మణికట్టు గాయంతో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఈ గాయం కారణంగానే తాను ప్రస్తుత నిర్ణయం తీసుకున్నానని అతను పేర్కొన్నాడు. తాను తీసుకున్న నిర్ణయం తనను చాలా నిరాశకు గురి చేసిందని అయితే నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని అతను తెలిపాడు.
ప్రస్తుతం ఆసియా సర్క్యూట్ పోటీలనుంచి దూరమైనా ఈ నెలాఖరులో జరిగే యూరోపియన్ టోర్నీలపై దృష్టి సారిస్తున్నట్టు శ్రీధర్ పేర్కొన్నాడు. ఆ పోటీల సమయానికి తాను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాననే నమ్మకం ఉన్నట్టు శ్రీధర్ తెలిపాడు.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా బీజింగ్లో ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న శ్రీధర్ రెండో రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
|