ఏఐబీఏ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత బాక్సర్ నానోసింగ్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నాడు. రష్యాకు చెందిన కాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత గ్రిగోరియ్ నికోలేచుక్పై నానో సంచలన విజయం సాధించి పథకాన్ని చేజిక్కించుకున్నాడు.కాగా, ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ఈవెంట్లో పతకం సాధించిన ఏకైక భారతీయుడు నానో సింగే కావడం విశేషం కాగా, 15 పాయింట్లతో భారతదేశం 9 స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే... నాలుగు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలతో క్యూబా దేశం అగ్రస్థానంలో నిలిచింది. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |