ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > కామన్వెల్త్ క్రీడలను భారత్‌లోనే నిర్వహించాలి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కామన్వెల్త్ క్రీడలను భారత్‌లోనే నిర్వహించాలి
వచ్చే ఏడాదిలో జరిగే కామన్వెల్త్ క్రీడలను షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే నిర్వహించాలని లండన్ 2012 ఒలింపిక్ క్రీడల నిర్వాహక కమిటీ ఛైర్మన్ సెబాస్టియన్ కోయ్ అభిప్రాయపడ్డారు. భద్రతపరమైన సవాళ్లను ఎదుర్కొని భారత్‌లోనే ఈ క్రీడలు నిర్వహించాలని ఆయన సూచించారు.

లండన్‌లో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెబాస్టియన్ మాట్లాడుతూ, అనేక ప్రతిష్టాత్మక టోర్నీలున్నాయి. ఇది ప్రపంచం.. ఈ ప్రపంచంలో పెద్ద టోర్నీలన్నీ జరుగుతూనే ఉండాలని వివరించారు. కామన్వెల్త్‌కు భద్రత సమస్యలు తలెత్తవచ్చని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇలాంటి విషయాలన్నీ ఓ సవాలుగా తీసుకుని భారత్ ఈ టోర్నీని నిర్వహించాలని తెలిపారు.

ఇటువంటి ప్రధాన టోర్నీలు ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు ఇతర దేశాల ప్రధాన క్రీడా సమాఖ్యలు భారత్ వంటి దేశాలకు సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని.. కనుక ఐపీఎల్-2కు అదనపు భద్రత కల్పించలేమని భారత ప్రభత్వం స్పష్టం చేసింది.

దీంతో ఈ టోర్నీని భారత్‌లో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఫుట్‌బాల్ ఛాంపియన్‌‍షిప్ కోప్ట్ కైవసం
గ్రామీణ హాకీ అభివృద్ధి కార్యక్రమం: ఎంహెచ్ఏ
సినెక్రాన్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకున్న ఎంహెచ్ఎ
వింటర్ ఒలింపిక్ గేమ్స్‌కు అర్హత సాధించిన కేశవన్
ఆంబర్ చెస్: క్రామ్నిక్‌పై ఆనంద్ గెలుపు
మియామీ టోర్నీ నుంచి తప్పుకున్న షరపోవా!