పూనేలోని పీవైసీ జింకానా కోర్టువద్ద జరుగుతున్న గ్రూప్ ఏషియన్ అండర్-21 స్నూకర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత జూనియర్ జాతీయ ఛాంపియన్ అయిన షహబాజ్ అదిల్ ఖాన్ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో చైనాకు చెందిన లీ యువాన్పై స్ట్రెయిట్ ఫ్రేమ్స్లో షహబాజ్ గెలుపొందాడు.
కీలకమైన ఈ మ్యాచ్లో షహబాజ్.. నాకౌట్కు క్వాలిఫై అయ్యేందుకు విజయానికి ఒక ఫ్రేమ్ దూరంలో ఉండగా ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో ప్రత్యర్థి లీ పుంజుకున్నాడు. అయితే చివరలో షహబాజ్ బ్లూ మరియు పింక్లను తీసుకుని లాస్ట్ ఎయిట్లో స్థానం ఖరారు చేసుకున్నాడు. |