భారత్ 2018 ఆసియా క్రీడలకు బిడ్ దాఖలు చేయనుంది. 2018 ఏషియాడ్ ఆతిథ్యానికి భారత్ గట్టిపోటీ ఇస్తోంది. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ పాహద్ అల్ సాబాహ్ 2007లో ఈ ఏషియాడ్ను భారత్కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. భారత్ 2014 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సాబాహ్ భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రణ్ధీర్ సింగ్తో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్లో పరిస్థితులు ఇప్పుడు చాలా మారాయి. ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ దక్కాలని షేక్ అహ్మద్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రారంభ ఆసియా క్రీడలకు (1954) భారత్ ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. అనంతరం 1982లో ఏషియాడ్కు కూడా భారత్ ఆతిథ్యం ఇచ్చింది. వచ్చే ఏడాది కామన్వెల్త్ క్రీడలకు భారత రాజధాని వేదిక కానుంది. కామన్వెల్త్ క్రీడల కోసం సిద్ధం చేసిన 80 శాతం మౌలిక సదుపాయాలను ఏషియాడ్కు కూడా ఉపయోగించుకోవచ్చు.
2018 ఏషియాడ్కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశంతోపాటు, 2010 హాకీ ప్రపంచకప్, ఆసియాలో ఒలింపిక్స్ పరిస్థితులపై అహ్మద్, రణ్ధీర్ మధ్య చర్చలు జరిగాయి. |