ముంబైలో జరుగుతున్న ఐటీఎఫ్ ఫ్యూచర్స్ మహిళల టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన అనుశ్రీ తమన్నా.. ముంబై భామ సాగరికా ఫాడ్కేపై గెలుపొంది మెయిన్ డ్రాకు క్వాలిఫై అయింది. రెండో రౌండులో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో సాగరికపై 6-2, 2-6, 6-2తో అనుశ్రీ అనూహ్య విజయాన్ని అందుకుంది.
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ అయిన ఈ టోర్నీ ముంబైలోని శివాజీ పార్క్ జిమ్కానా హార్డ్ కోర్డులలో జరిగింది. ఈ టోర్నీ తొలి రౌండులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తన్వీ షాహ్తో తలపడిన అనుశ్రీ గెలుపొంది.. రెండో రౌండుకు చేరుకుంది.
అదలా ఉంచితే మరో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన ఢిల్లీ భామ ప్రేరణా బాంబ్రీ కర్ణాటకకు చెందిన ఆశా నందకుమార్పై 4-6, 6-3, 6-4తో గెలుపొందింది. ప్రారంభరౌండులో క్వాలిఫైయర్ అయిన ఐశ్వర్య శ్రీవాత్సవ పై ప్రేరణా గెలుపొందింది. |